నిర్మల్ : జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో నార్త్ జోన్ ఐజీ వై.నాగిరెడ్డి పర్యటించారు. నిర్మల్ పట్టణం జీయన్ఆర్ కాలనీలో వరద ప్రభావిత ప్రాంతంలో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ఎవరు భయపడొద్దని భరోసానిచ్చారు. భారీ వర్షాల వల్ల కలిగిన నష్టం వివరాలను, సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల నీటి ప్రవాహం గురించి అన్ని జాగ్రత్తలు తీసుకొని సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు.
ఎక్కడైనా వరద ఉధృతితో రోడ్లు తెగిపోయిన, వరద నీరు ఉఉధృతంగా ప్రవహించినా అట్టి సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు తెలియజేయాలన్నారు. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే తమ పరిధిలోని పోలీస్ స్టేషన్ అధికారులకుగాని డయల్ 10కు గాని ఫిర్యాదు చేయాలన్నారు.
ఐజీ వెంట జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారుఖి, ఎస్పీ ప్రవీణ్ కుమార్, అదనపు ఎస్పీ రాంరెడ్డి, డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ రమేష్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
మత్తడి దుంకుతున్న లక్నవరం సరస్సు
ప్రమాదస్థాయిలో గోదావరి ప్రవాహం
వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి పువ్వాడ