హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సోమవారం జరిగే నిరసన దీక్షా ప్రాంగణంలో టీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి నేత బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీలు కే కేశవరావు, జోగినపల్లి సంతోష్కుమార్, నామ నాగేశ్వర్రావు, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలే యాదయ్య, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, టీఆర్ఎస్ మైనార్టీ నేతలు జాంగిర్, వలీ, టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు ఫరీదుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.