హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): విద్యాశాఖలో రెండు దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్పర్సన్ (ఐఈఆర్పీ)లను రెగ్యులరైజ్ చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. మంగళవా రం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 996 మంది ఐఈఆర్పీలు మానసిక వైకల్యంతో బాధపడుతున్న డబ్భు వేల మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో వీరిని రెగ్యులరైజ్కు ప్రయత్నాలు జ రిగాయని, ఎన్నికల కోడ్ తో ఆ ప్రక్రియ నిలిచిపోయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డీఎస్సీకి సిద్ధమవుతున్న నేపథ్యంలో వీరిని రెగ్యులరైజ్ చేయాలని కోరారు. మానసిక వైకల్యం ఉన్నవారికి విద్యను బోధించడం సాధారణ విషయం కాదని, ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించాలని కోరారు.