నిజామాబాద్ : కరోనా కట్టడికి ఇంటింటికి జ్వర సర్వే నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జిల్లాలోని నందిపేట్ మండలం సీహెచ్ కొండూర్ గ్రామంలో ఎమ్మెల్సీ పర్యటించారు. స్థానిక లక్ష్మీ నరసింహ స్వామి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ ఇలవేల్పు లక్ష్మి నరసింహ స్వామి అలయాన్ని నూతనంగా నిర్మించేందుకు గ్రామస్థులతో చర్చించారు. తమ కుటుంబం ఆధ్వర్యంలో ఆలయాన్ని పునర్నిర్మిస్తామని ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అదేశాల మేరకు చేపట్టిన ఇంటింటి సర్వే విజయవంతమైందని పేర్కొన్నారు. కరోనా పాజిటివ్ రేటు తగ్గటంలో జ్వర సర్వే ఎంతో ఉపయోగ పడిందని తెలిపారు. నిజామబాద్ నుంచి నందిపేట్ చేరుకున్న ఎమ్మెల్సీ కవిత గారికి టీఆర్ఎస్ నాయకులు, స్థానికులు ఘనస్వాగతం పలికారు.
ఆలయ దర్శనం అనంతరం రూ. 110 కోట్లతో నిజామాబాద్-ఆదిలాబాద్ లను కలిపే విధంగా నిర్మించిన బ్రిడ్జి ను ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. నందిపేట్ మండలానికి మహారాష్ట్ర నుంచి రాకపోకలు ఎక్కువగా ఉన్న దృష్ట్యా గ్రామ స్థాయిలోనే కరోనాను కట్టడి చేసే విధంగా చర్యలు చేపట్టనున్నామని ఎమ్మెల్సీ తెలిపారు.
మూడో వేవ్ ముప్పు ప్రచారం నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని కవిత సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గువ్వల బాలరాజు, జడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
బ్యాంకు ఉద్యోగులకు వ్యాక్సినేషన్
టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేద్దాం : ఎమ్మెల్యే ఆరూరి
పాలకుర్తిలో వ్యవసాయ, టాస్క్ఫోర్స్ అధికారుల విస్తృత తనిఖీలు
పుణె పరిశోధన : కరోనా కొత్త వేరియంట్ గుర్తింపు
సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సర్వే పనులకు శ్రీకారం
రెండు రోజుల్లో పెండింగ్ భూ సమస్యలు పరిష్కరించాలి