Kaleshwaram | కాళేశ్వరం – మేడిగడ్డ బ్యారేజ్ను శిక్షణ ఐఏఎస్ అధికారులు గురువారం సందర్శించారు. మర్రి చెన్నారెడ్డి మానవవరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ శ్రీ శశాంక్ గోయల్ ఆదేశాలతో కోర్సు డైరెక్టర్ ఏఎస్ రామచంద్రం సూచన మేరకు నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఐఏఎస్ అధికారులు మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించారు.
బ్యారేజ్ను సందర్శించిన వారిలో 2022 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు ఉమాశంకర్, అమిత్, మయాంక్, వికాస్, కిరణ్మయి, శ్రద్ధ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మేడిగడ్డ బ్యారేజ్ డీఈ తిరుపతి రెడ్డి, ఇరిగేషన్ ఏఈ, జేఈలు, మహాదేవ్పూర్ డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాళేశ్వరం ఆలయంలో ఐఏఎస్ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.