హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ): పాస్పోర్టు సేవలను విస్తరించేలా రీజనల్ పాస్పోర్టు కార్యాలయ అధికారులు మరోసారి స్పెషల్ డ్రైవ్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. వచ్చే నాలుగు శనివారాల పాటు సేవలను అందించనున్నారు.
దీనికి బేగంపేట్, అమీర్పేట్, టోలిచౌకి, నిజామాబాద్, కరీంనగర్ పాస్పోర్టు, పోస్టు ఆఫీస్ పాస్పోర్టు సేవా కేంద్రాల్లో ప్రత్యేక డ్రైవ్ సేవలు అందుతాయని రీజనల్ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు.