ఆఫీస్ స్పేస్ లీజింగ్లో హైదరాబాద్ దేశంలోనే ముందుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బెంగళూరును అధిగమించి మరీ హైదరాబాద్ అగ్రస్థానంలో నిలువడం గర్వకారణమని తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ట్వీట్ చేశారు.
ఇందుకు సంబంధించి ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించిన కథనాన్ని మంత్రి కేటీఆర్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తక్కువ అద్దెలు, స్థిరమైన వ్యాపార అవకాశాలు.. హైదరాబాద్ను ఆఫీస్ స్పేస్ మార్కెట్ చార్టులో అగ్రస్థానాన నిలబెట్టాయని కేటీఆర్ వెల్లడించారు.