హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్-పుణె (హడప్సర్) ఎక్స్ప్రెస్ను కాజీపేట వరకు పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య సమాచార అధికారి కే రాకేశ్ తెలిపారు. వారానికి మూడుసార్లు నడవనున్న ఈ రైలు (నం.17013/17014) ను కాజీపేట టెర్మినల్కు మార్చగా సికింద్రాబాద్ మీదుగా ప్రయాణిస్తున్నదని పేర్కొన్నారు. రిజర్వేషన్ చేసుకొన్న ప్రయాణికులు స్టేషన్ టెర్మినల్లో మార్పును గమనించాలని సూచించారు.