హైదరాబాద్ సిటీబ్యూరో/శేరిలింగంపల్లి, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో గురువారం భారీమొత్తంలో నగదు పట్టుబడింది. ఒక వ్యాపారి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.5 కోట్లను గచ్చిబౌలి పోలీసులు సీజ్ చేశారు. కొండాపూర్ బొటానికల్ గార్డెన్ చిరెక్ పబ్లిక్ స్కూల్ రహదారిపై వెళ్తున్న టీఎస్02 ఈవై2678 నంబర్ మారుతి బ్రీజా కారును సోదా చేయడంతో రెండు బ్యాగుల్లో ఈ డబ్బు పట్టుబడినట్టు నట్టు ఇన్స్పెక్టర్ జేమ్స్బాబు వెల్లడించారు.
ఎలాంటి ఆధారాల్లేకుండా తరలిస్తున్న ఆ సొమ్మును ఐటీ అధికారులకు అప్పగించినట్టు తెలిపారు. ఆ డబ్బును తరలిస్తున్న పెద్దపల్లి జిల్లా శివపల్లి గ్రామానికి చెందిన వ్యాపారవేత్త దుగ్యాల సంతోష్రావు (36)తోపాటు తుర్కల మడ్డికుంట గ్రామానికి చెందిన ముత్యాల నరేశ్ (36), సుల్తానాబాద్ కట్నపల్లికి చెందిన చీతి సంపత్రావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు వివరించారు.