హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకా శాలున్నాయని పేర్కొన్నది.
ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని చెప్పింది. ఈ మేరకు ఎల్లో ఆలర్ట్ను జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డా యి.