KTR | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ డాటా ఎంబసీల ఏర్పాటుకు భౌగోళికంగా ఎంతో సురక్షితమైన, అనుకూలమైన హైదరాబాద్ నగరాన్ని కూడా పరిశీలించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. డాటా ఎంబసీలను కేవలం గుజరాత్లోని గిఫ్ట్సిటీలో మాత్రమే ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆయన అభ్యంతరం వ్యక్తంచేశారు.
ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు గురువారం లేఖ రాశారు. అత్యంత కీలకమైన డాటా ఎంబసీలని కేవలం ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయడం అనేక సమస్యలకు దారితీస్తుందని, అందువల్ల వేర్వేరు ప్రాంతాల్లో ఆ కేంద్రాలను నెలకొల్పాని సూచించారు. గిఫ్ట్ సిటీ భూకంపాలు వచ్చేందుకు అవకాశం ఉన్న భౌగోళిక ప్రాంతమని, దీంతోపాటు దేశ సరిహద్దు మీదున్న రాష్ట్రంలో డాటా ఎంబసీలను ఏర్పాటు చేయడం అత్యంత రిస్తో కూడుకొని ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ నగరానికి భౌగోళికంగా ప్రకృతి వైపరీత్యాల నుంచి సహజంగా వస్తున్న రక్షణ, అనుకూలతలను వివరించారు. డాటా ఎంబసీల ఏర్పాటు విషయంలో ఆయా దేశాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
భూకంపాల విషయంలో భారతదేశంలోనే అత్యంత సురక్షితమైన సీస్మిక్ జోన్-2లో హైదరాబాద్ నగరం ఉన్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. అందుకే హైదరాబాద్ నగరంలో డాటా సెంటర్లను ఏర్పాటు చేయడం అత్యుత్తమమైన నిర్ణయం అవుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న గిఫ్ట్సిటీ సీస్మిక్ జోన్-3, సీస్మిక్ జోన్-4కు అత్యంత దగ్గరగా ఉన్న ప్రదేశమని, అకడ భూకంపాలు భారీగా వచ్చే అవకాశం ఉన్నదని గుర్తుచేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే మొత్తం డాటా ఎంబసీల కార్యకలాపాలు స్తంభించి, దాని ప్రభావం అంతర్జాతీయ సంబంధాలపై ఉంటుందని పేర్కొన్నారు.
ఇప్పటికే అనేక అంతర్జాతీయ కంపెనీలు భారతదేశంలో తమ డాటా సెంటర్ల ఏర్పాటుకు ముందు విస్తృతమైన అధ్యయనాలు చేసి, తెలంగాణను కేంద్రంగా ఎంచుకున్న విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ మొదలుకొని మైక్రోసాఫ్ట్ వరకు అనేక కంపెనీలు హైపర్ సేల్ డాటా సెంటర్లను తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 2016లోనే తమ డాటా సెంటర్ పాలసీని ప్రకటించిందని గుర్తుచేశారు. డాటా సెంటర్ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, ఇతర సౌకర్యాల విషయంలో తెలంగాణ పాలసీ అత్యంత ఆకర్షణీయంగా ఉన్నదని తెలిపారు.
డ్యూయల్ పవర్గ్రిడ్ సౌకర్యంతోపాటు అత్యంత తకువ ధరకే విద్యుత్తు సరఫరా, హైస్పీడ్ ఫైబర్ నెట్వర్క్ వంటి అనేక అనుకూలతలు తెలంగాణకు ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణలో డాటా సెంటర్లను ఏర్పాటుచేసిన కంపెనీలు తమ కార్యకలాపాల పట్ల, ఇకడి పెట్టుబడుల అనుకూల వాతావరణం పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్న విషయాన్ని సైతం కేటీఆర్ తన లేఖలో వివరించారు. ఇప్పటికే అనేక డాటా సెంటర్లను ఏర్పాటు చేసిన కంపెనీలకు అందించిన పూర్తి సహాయ సహకారాలను ఇంటర్నేషనల్ డాటా ఎంబసీస్ ఏర్పాటుకు కూడా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
డాటా ఎంబసీలను ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలించాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఈ బడ్జెట్లో ప్రతిపాదించిన డాటా ఎంబసీలను దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా ఏర్పాటు చేసే విధంగా పునర్నిర్వచించాలని సూచించారు. తద్వారా దేశంలోని ఇతర ప్రాంతాలకు సైతం ఈ విషయంలో సమాన అవకాశాలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లు అవుతుందని తెలిపారు. ఏదైనా ఒక దేశానికి చెందిన కంపెనీ ఒక డాటా ఎంబసీని ఏర్పాటుచేస్తే దానికి ప్రస్తుతం దౌత్య కార్యాలయాలకు లభిస్తున్న విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రత్యేకమైన సౌకర్యాలు ఉంటాయి. ఆయా కంపెనీలు తమ అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొనేందుకు దేశ చట్టాల నుంచి వెసులుబాటు/రక్షణ ఈ డాటా ఎంబసీస్కి ఉంటుంది.
అత్యంత కీలకమైన డాటా ఎంబసీలను ఒకేచోట ఏర్పాటు చేయడం అనేక సమస్యలకు దారితీస్తుంది. గుజరాత్ గిఫ్ట్ సిటీ భూకంప జోన్లో ఉన్నది. దేశ సరిహద్దున ఉన్న రాష్ట్రంలో డాటా ఎంబసీలను ఏర్పాటు చేయడం అత్యంత రిస్. హైదరాబాద్ భౌగోళికంగా అత్యంత సురక్షిత నగరం.
– మంత్రి కేటీఆర్