హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): పురపాలకశాఖ మంత్రిగా కే తారక రామారావు జీహెచ్ఎంసీ పరిధిలో చేసిన అభివృద్ధి, కృషి కారణంగా రాజధాని ఓటర్లు బీఆర్ఎస్ వైపు ఆకర్షితులయ్యారని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు చెప్పారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేకే మాట్లాడుతూ కార్యకర్తలు లేనిదే పార్టీ లేదని, జెండా మోసిన వారికి న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు.
ఉద్యమకారుల్లో ఉన్న అసంతృప్తిని గుర్తించామని, వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణలో హైదరాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలు హీరోలని, ఏ గాలి కూడా హైదరాబాద్లో బీఆర్ఎస్ గెలువును అడ్డుకోలేకపోయిందని అన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కార్యకర్తలు ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారని పేర్కొన్నారు. బీఆర్ఎస్లో యువతను మరిం త ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని తెలిపారు. ప్రతి మూడు నెలలకోసారి పార్టీ మీటింగ్లు మండలస్థాయి నుంచి ఏర్పాటు చేసుకుందామని అన్నారు. పార్టీలో ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యూ వరకు అన్ని భావజాలాల వారు ఉన్నారని చెప్పారు.