కమలాపూర్, డిసెంబర్ 12: తన గొంతులో ప్రాణమున్నంత వరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తోనే ఉంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తొలిసారి హనుమకొండ జిల్లా కమలాపూర్కు వచ్చిన ఆయన్ను స్థానిక పద్మశాలీ కమ్యూనిటీ హాలులో మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కౌశిక్రెడ్డిని సన్మానం చేశారు.
ఈ సందర్భంగా కౌశిక్రెడ్డి మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్టు కొందరు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు.