హుజూరాబాద్ : టీఆర్ఎస్ వెంటే మైనార్టీలు ఉన్నారని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు కమలాపురం మండలంలోని ఉప్పల్ గ్రామ మైనార్టీలు తీర్మానించుకున్నారు. ఈ మేరకు తీర్మాన కాపీని ఎమ్మెల్యే బాల్క సుమన్కు అందజేశారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన ముస్లింలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమానికి టీఆర్ఎస్ కట్టుబడి ఉందని, కేసీఆర్ పాలనలోనే ముస్లిం సోదరులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు.