హుజూరాబాద్ : రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికలో మైనార్టీలందరూ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కే మద్దతుగా ఉంటారని ఇల్లంతకుంట మండల మైనార్టీ నాయకులు స్పష్టం చేశారు. మండల పరిధిలోని సిరిసేడు గ్రామంలో కరీంనగర్ టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు మొహమ్మద్ అజీమ్ ఉద్దీన్, నయీమ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో హుస్సేన్, అక్బర్, ముస్తాఫా పాల్గొని తమ సమస్యలపై చర్చించారు. అనంతరం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లోని మసీదులు, ఈద్గాల అభివృద్ధిపై తయారు చేసిన నివేదికను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మైనార్టీ నాయకులు అందించారు.
ఈ సందర్భంగా అజీమ్ ఉద్దీన్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీలకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఎక్కడా లేని విధంగా మైనార్టీ విద్యార్థులకు రెసిడెన్షియల్ స్కూల్స్ను ఏర్పాటు చేశారన్నారు. ఇమామ్లకు, మౌజంలకు గౌరవ వేతనం అందిస్తున్నారని పేర్కొన్నారు. హుజూరాబాద్లో జరగబోయే ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటేసి.. గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మైనార్టీ వర్గాలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వలి పాషా, లాల్ మొహమ్మద్, రహీం హుస్సేన్ రబ్బాని, హకీం రజాక్తో పాటు పలువురు పాల్గొన్నారు.