హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి కన్నుమూశారు. శుక్రవారం ఉదయం 4 గంటలకు గుండెపోటు రావడంతో హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం హుజూరాబాద్ మండలం జూపాక. సాయిరెడ్డి గతంలో ఉమ్మడి కరీంనగర్ జడ్పీ చైర్మన్గా కూడా పనిచేశారు. 1983, 1989లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. కాగా, మాజీ ఎమ్మెల్యే మృతిపట్ల మంత్రి ఈటల రాజేందర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సంభ్యులకు సానుభూతి వ్యక్తంచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..