హుజూరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నిక నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఈనెల 11న నామినేషన్లను పరిశీలించనున్నారు. 13న నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్లో ఉప ఎన్నిక జరుగుతున్నది. దీనికి సంబంధించి అక్టోబర్ 1న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 30న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 2న ఓట్లను లెక్కించనున్నారు.
ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ తరఫున గెల్లు శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల ప్రచారంలో కారు పార్టీ దూసుకుపోతున్నది. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపును తన భుజాన వేసుకున్న మంత్రి హరీశ్ రావు.. ప్రచారంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.