కరీంనగర్ : ఈటల వ్యక్తిగత స్వార్థం కోసమే హుజురాబాద్ ఉప ఎన్నికలు అని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. హుజూరాబాద్ జిల్లా కావాలని, లేదా హుజూరాబాద్కు మెడికల్ కాలేజీ కావాలని రాజీనామా చేశారా..?స్వలాభం కోసం ఈటల రాజీనామా అని విమర్శించారు.
ధర్మరాజుపల్లిలో మంత్రి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం. నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ ఎన్నికల్లో ధర్మాన్ని, న్యాయాన్ని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
వ్యక్తి లాభం ముఖ్యమా..వ్యవస్థ లాభం ముఖ్యమా అనేది ఆలోచించాలన్నారు. ఈటల రాజేందర్ ఎందుకు బీజేపీలోచేరారు. బీజేపీ ప్రజలకు ఏం చేసిందని ఆ పార్టీలో చేరారని ప్రశ్నించారు. గ్యాస్సిలిండర్ ధర పెంచి ప్రజలకు బీజేపీ వాతలు పెడుతోంది. నిన్న అక్కా, చెళ్లెళ్లు బతుకమ్మల మధ్య సిలిండర్లు పెట్టి బీజేపీ ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు.
గ్యాస్ సిలిండర్ ధర వేయి రూపాయులు చేసిన బీజేపీ నిన్న మరో 15 రూ పెంచారు. వారం వారం బీజేపీ గ్యాస్, పెట్రోల్, డిజిల్ ధరలు పెంచూతూ సామాన్యుడి నడ్డివిరుస్తోందన్నారు. ధరలు పెంచే బీజేపీకి ఓటు వేద్దామా అని ప్రశ్నించారు. ఈటల నన్ను చూసే పనులు జరుగుతున్నాయని చెపుతున్నడు. మరి కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్ ఎవరిని చూసి కేసీఆర్ ఇచ్చారని సూటిగా ప్రశ్నించారు.
రైతు బంధు అందుకున్న తొలి రైతు ధర్మరాజుపల్లి వాసేనని గుర్తు చేశారు. కరోనా సమయంలోను సీఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఆపి మరీ రైతులకు రైతు బంధు ఇచ్చారన్నారు. రెండు వేల పెన్షన్ ఆపలేదు. కార్డు దారులకు రూ. 1500 బియ్యం, పప్పులు కరోనా సమయంలో అందజేశాం.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఆడపిల్లల పెళ్లికి లక్ష రూపాయల సాయం చేస్తున్నారా అని ప్రశ్నించారు. కళ్యాణ లక్ష్మి ఉండాలా వద్దా..రాజేందర్ కళ్యాణ లక్ష్మి వద్దు అంటున్నారు. మీరే ఆలోచన చేయాలన్నారు. మేం గెలిస్తే విదేశాల నుంచి నల్ల ధనం తెచ్చి 15 లక్షల రూపాయలు మీ అక్కౌంట్లలో వేస్తామని బీజేపీ వాళ్లు చెప్పారు.
ఒక్క రూపాయి అయినా వేసారా? ధరలు పెంచి వాతలు పెడుతున్నారు. సబ్సిడీల్లో కోతలు విధిస్తున్నారని బీజేపీ పార్టీపై ధ్వజమెత్తారు. ఆరు సార్లు ఈటలను గెలిపించారు. ఒక్క ఇళ్లు కట్టలేదన్నారు. గెల్లుని ఒక్కసారి గెలిపించండి. డబుల్ బెడ్రూం ఇల్లుకట్టిస్తామని హామీనిచ్చారు.