..పై చిత్రంలో పిల్లర్లతో అసంపూర్తిగా కనిపిస్తున్నది వీణవంకలోని మహిళా సంఘ భవన నిర్మాణం. 2016లో 25లక్షలతో సంఘ భవనాన్ని నిర్మించేందుకు ఈటల రాజేందర్ ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించాడు. సంఘ భవన నిర్మాణానికి ఆయనే భూమిపూజ చేయడంతో మహిళలు సంతోష పడ్డారు. రెండు నెలలపాటు పనులు చకచకా నడిచి పిల్లర్లు లేచాయే తప్ప నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు. ఐదేళ్ల గడిచినా ముందుకుసాగలేదు. ఈటల ఐదేళ్లు ఆర్థిక మంత్రిగా, రెండేళ్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నా ఆ భవనం తుది దశకు చేరలేదు. కానీ, మాట్లాడితే అన్ని గ్రామాల్లో సంఘ భవనాలకు నిధులు కేటాయించానని పదేపదే చెబుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నిధులు ఇస్తోంటే లేని పోని ఆరోపణలు చేస్తున్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 107 గ్రామ పంచాయతీలున్నాయి. అందులో కేవలం 14 జీపీల్లోనే మహిళా సంఘాలకు భవనాలు ఉన్నాయి. మిగతా పంచాయతీల్లో భవనాలు లేక ఎన్నో ఏండ్లుగా ఇబ్బందులు పడ్డారు. సమావేశాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించేందుకు అవస్థలు పడ్డారు. ఎక్కడో చెట్ల కిందనో.. లేదంటే హాల్ను అద్దెకు తీసుకోవాల్సి వచ్చేది. నాడు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ను కలిసి ఎన్నోసార్లు తమ బాధలను విన్నవించుకున్నారు. భవనాలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
కానీ, ప్రయోజనం లేక నిరాశ చెందారు. కొద్ది రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రుల దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లడంతో సానుకూల స్పందన లభించింది. సర్కారు ఇటీవలే నిధులు మంజూరు చేసింది. బుధ, గురువారాల్లో పర్యటించిన మంత్రి హరీశ్రావు, మహిళా సంఘ భవన నిర్మాణాలకు సంబంధించిన జీవోలను మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు. దాంతో మహిళలు సంతోషపడుతున్నారు. కానీ, ఇదే సమమంలో బీజేపీ నేత ఈటల రాజేందర్ మాత్రం 2018లోనే మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించానని చెబుతున్నారు.
ఒక్కో భవనానికి 10 లక్షలు కేటాయించినట్లు జీవో తీసుకొచ్చానని అంటున్నారు. అది కూడా 51 గ్రామ పంచాయతీల్లో సంఘ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు ఆయన తెచ్చిన జీవోలో ఉన్నది. అయితే నిధులు మంజూరు చేస్తే ఎందుకు భవనాలు నిర్మించలేదు? ఇన్నాళ్లూ ఏం చేసినట్లు? అని మహిళలు ప్రశ్నిస్తున్నారు. లేని పోని ముచ్చట్లు చెప్పడమే కాదు, సరైన జవాబు చెబితే బాగుంటుందని మండిపడుతున్నారు. అప్పుడేమో పట్టించుకోకపోగా ఇప్పుడు ప్రభు త్వం భవనాలకు నిధులు ఇస్తోంటే లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలుకుతున్నారు.
వీణవంకలో మొత్తం 26 గ్రామ పంచాయతీలు ఉండగా చల్లూరు, మరో గ్రామంలో మాత్రమే మహిళసంఘాల భవనాలు ఉన్నాయి. మిగతా 24 గ్రామాల్లో భవనాలు లేవు. మొత్తం 1086 సంఘాలు ఉండగా 11,905 మంది సభ్యులు ఉన్నారు. రెండు రోజులక్రితం ఆర్థిక మంత్రి హరీశ్రావు మహిళా సంఘాలతో సమావేశమైనప్పుడు 24 గ్రామ పంచాయతీల్లో సకల సౌకర్యాలతో భవనాలు నిర్మించేందుకు 4.8కోట్లు నిధులు కేటాయించారు. ఇందుకు సంబంధించిన జీవోను అందజేశారు.
జమ్మికుంటలో మొత్తం 20 జీపీలు ఉండగా, ఒక గ్రామంలో నూ కూడా భవనంలేదు. ఇక్కడ 755సంఘాలు ఉండగా 8,200 మంది సభ్యులు ఉన్నారు. 20గ్రామ పంచాయతీలకు గాను 4కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. దీనికి సంబంధించిన జీవోను త్వరలో సంఘాలకు అందజేయనున్నారు.
ఇల్లందకుంటలో 18పంచాయతీలుండగా లక్ష్మాజిపల్లిలో మా త్రమే సంఘ భవనం ఉన్నది. అదికూడా ఇంకా సంఘాలకు అప్పగించలేదు. మిగతా 17 జీపీల్లో సంఘభవనాల నిర్మా ణం కోసం 3.4కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందు కు సంబంధించిన జీవోను సంఘాలకు అందజేశారు. ఇక్కడ 682 సంఘాలు ఉండగా 7,302 మంది సభ్యులు ఉన్నారు.
మండలంలో 19 జీపీలకు 5 గ్రామాల్లో మహిళా సంఘభవనాలు ఉన్నాయి. మొత్తం 891 సంఘాలు ఉండగా, 10, 509మంది సభ్యులు ఉన్నారు. 14 గ్రామాల్లో మహిళా సంఘాల భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం 2.8కోట్లు కేటాయించింది. వీటికి సంబంధించిన జీవోను మంత్రి హరీశ్రావు గురువారం హుజూరాబాద్లో జరిగిన మహిళా సం ఘాల సమావేశంలో అందజేశారు.
24 జీపీలకు 6 పంచాయతీలకు మాత్రమే సంఘభవనాలు ఉన్నాయి. ఇక్కడ నియోజకవర్గంలోనే అత్యధికంగా 1470 సంఘాలుండగా 16,950 మంది సభ్యులు ఉన్నారు. భవనాలు లేని 18 పంచాయతీలకు గాను ప్రభుత్వం 3.6కోట్లు మంజూరు చేసింది. ఇటీవల జరిగిన మహిళా సంఘాలసమావేశంలో మంత్రి దయాకర్రావు జీవోను అందజేశారు.
మహిళా సంఘాలకు తీసుకున్న రుణాలకు వడ్డీ మాఫీ చేస్తరంటే మొదట నమ్మలేదు. స్వయంగా ఆర్థిక మంత్రి హరీశ్రావు రుణమాఫీ చెక్కు ఇస్తోంటే సంతోషంతో మాకు మాటలు రాలేదు. ఒక్కరూపాయి కాదు, రెండు రూపాయలు కాదు ఏకంగా మా మండలానికే 3.55 కోట్ల మాఫీ చేయడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా ప్రభుత్వానికి రుణపడి ఉంటం. ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఇంత వరకు ఎప్పుడూ చూడలేదు. మహిళ సంక్షేమం కోసం ఆలోచన చేసిన ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమే. ఇలాంటి ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఎల్లకాలం సల్లంగ ఉండాలె. మేము ఉన్నంత కాలం టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటం.- భాగ్యలక్ష్మి, స్వయం కృషి సంఘం (ఎలుబాక)
మహిళా సంఘ భవనం కావాలని హుజూరాబాద్ మండలం నుంచి మహిళలందరం ఈటల రాజేందర్ను చాలాసార్లు కలిసినం. ఎన్నిసార్లు అడిగినా ఒక్క భవనం కట్టియ్యలేదు. మండల కేంద్రంలో మహిళా సంఘ భవనం కట్టిస్తనని శంకుస్థాపన చేసిండు. అది అక్కడనే ఉన్నది. భవనాలు లేక బాగా ఇబ్బందులు పడ్డం. సీఎం కేసీఆర్ సార్ మా కోసం ఆలోచన చేసి అన్ని గ్రామాల్లో భవనాలు కట్టడానికి డబ్బులు మంజూరు చేసిండు. ఈ భవనాలు కట్టియ్యడం అంటే మహిళల ఆత్మగౌరవం కాపాడినట్లే. ప్రభుత్వానికి ఎల్లవేళలా తోడుగా ఉంటం. మాకు ఇంత గొప్ప పనులు చేసిన సీఎం కేసీఆర్ సారుకు, హరీశ్రావు సార్కు రుణపడి ఉంటం. – స్వప్న, కిష్టంపేట
కొట్లాడి సాధించుకున్న తెలంగాణల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో పథకాలను ప్రవేశపెట్టింది. ఇంకా పెడుతున్నది. రాష్ట్రం రాక ముందు వచ్చిన తర్వాత ప్రజల జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది. పడిపోయిన కులవృత్తులు మళ్లీ లేచినయి. పేదల బతుకులు బాగుపడ్డయి. ఇవ్వాళ భారతదేశమే తెలంగాణ వైపు చూస్తున్నదంటే అది కేసీఆర్ పాలన ఎట్ల సాగుతున్నదో అర్థమైతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ప్రజలను చైతన్యవంతం చేస్తున్నం. టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని, సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతున్నం. – ఎస్కే ఫయాజ్, టీఆర్ఎస్ యువజన నాయకుడు, (హుజూరాబాద్టౌన్).
గతంలో నీళ్లు లేక ఇబ్బందులు పడేది. అప్పుడు వరి పెట్టి చాలా సార్లు నష్ట పోయిన. ఇప్పుడు కెనా ల్ మంచిగ వస్తాంది. పంటలు కూడా మంచిగ పండుతున్నయ్. ఐకేపీల కొనుగోలు కేంద్రం పెట్టి పంటలు మంచిగ కొంటన్రు. గ్రామంల అన్ని సౌల తులు మంచిగనే కల్పిస్తన్రు. కేసీఆర్ సారుతోనే ఇ వ్వన్నీ సాధ్యమైనయి. ఆయన ఉంటనే మంచి పను లయితయి. లేకుంటే మళ్లీ పాతోళ్లు వచ్చి ఇబ్బందు లు పెడుతరు. ఈసారి కూడా కేసీఆర్ సారుకే ఓటేత్త. -మేడబోయిన ఉమ, మాచినిపల్లి (జమ్మికుంట)
మా శనిగరంలో ఏ సమస్యను పట్టించుకోలె. రహదారి సమస్య తీవ్రంగా ఉండె. మా ఇబ్బందులను ఈటలకు చెప్పినం. పట్టించుకోలె. ప్రజాసమ స్యలను ఏనాడూ పరిష్క రించలె. మా ఊరును గాలికి వదిలేసిండు. ఏ సమస్య చెప్పినా వినిపించుకోలె. కమిషన్లు వచ్చే పనులు చేసిండు. ప్రజల ఇబ్బందులు వినేటోడు కాదు. – కొత్తపల్లి రాజు, శనిగరం(కమలాపూర్)
నేను తెలంగాణకే ఓటేత్త.. తెలంగా ణను తెచ్చిన ఆ పెద్ద మనిషి కేసీఆర్తోనే మాకు మంచి. బతుకు దెరువు సూపెడుతడు. ఆయనచ్చినంకనే ఊర్ల రూపం మారుతాంది.. నాకు కొడుకుబిడ్డల్లేరు.. జాగల్లేవు.. ఆయనే నా కొడుకు లెక్క. మా ఆయనకు పింఛన్ అత్తాంది. నేను బర్లు కాసుకుంట పొట్ట పోసుకుంటున్న. ఇగ రేపటోళ్లు మంచిగ బతకాలంటే కేసీఆర్ సారుతోనే అయితది. -సమ్మక్క, బర్రెల కాపరి, కమలాపూర్