నర్సింహులపేట, ఫిబ్రవరి 7 : భార్య(Wife) చనిపోవడంతో తట్టుకోలేక ఐదు రోజల్లో భర్త(Husband dies) మృతిచెందిన విషాదకర సంఘటన బుధవారం మహబూబాబాద్(Mahabubabad) జిల్లా నర్సింహులపేట మండలంలోని జయపురం(Jayapuram) గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం మందుల సోమక్క(60) ఐదు రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. భార్య చనిపోయిన విషయాన్ని తట్టుకోలేక భర్త లింగయ్య(68) మృతిచెందాడు. భార్యభర్తలు ఇద్దరు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.