మంచిర్యాల, ఫిబ్రవరి 8 : సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకులను కార్పొరేట్లకు ధారాదత్తం చేసే కుట్రకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెరలేపడంపై టీఆర్ఎస్ భగ్గుమంటున్నది. కొన్ని రోజులుగా సింగరేణి వ్యాప్తంగా టీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉద్ధృతంగా నిర్వహిస్తున్నది. బుధవారం సామూహిక నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించింది. దీక్షల విజయవంతానికి టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో మంగళవారం గేట్ మీటింగ్ కూడా ఏర్పాటుచేశారు. ఆయా నియోజకవర్గ కేంద్రాల ఆందోళనల్లో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. మందమర్రి మార్కెట్ ఏరియాలో విప్ బాల్క సుమన్ పాల్గొంటారు.