వేములవాడ: దక్షిణ కాశి వేములవాడ (Vemulawada) శ్రీరాజరాజేశ్వర స్వామివారి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మేడారం జాతరకు ముందు రాజన్నను దర్శించుకునే ఆనవాయితీలో భాగంగా వేములవాడకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో రాజరాజేశ్వరుని ఆలయం జనసంద్రమైంది.
స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో క్యూలైన్లలో వేచిఉన్నారు. దీంతో రెండు గంటల సమయం పడుతున్నది. కోడె మొక్కుకోసం మరో 3 గంటలు పడున్నది.
కాగా, స్వామివారిని ఉదయం 11 గంటల వరకు 20 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తులు ఇబ్బందులు పడకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.