న్యూస్నెట్వర్క్, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 24: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును చూసి ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరుతున్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్, మోర్తాడ్ మండలాల నుంచి బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీలకు చెందిన వార్డు సభ్యులు, నాయకులు, యూత్ సభ్యులు సుమారు 200 మంది శనివారం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఖమ్మంలోని తెలంగాణభవన్లో శనివారం తిరుమలాయపాలెం రూరల్ మండలంలోని పిండిప్రోలుకు చెందిన 20 కుటుంబాలు బీఆర్ఎస్లో చేరాయి. వారికి ఎమ్మెల్సీ తాతా మధు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని చిన్నకొండూరు గ్రామంలో మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో చిన్నకొండూరు, పెద్దకొండూరు గ్రామాలకు చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే గాదరి కిశోర్ నివాసంలో తాళ్లసింగారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 20 మంది బీఆర్ఎస్లో చేరారు. నల్లగొండ జిల్లా హాలియాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ సమక్షంలో అనుముల మండలం కొత్తపల్లి, చింతగూడెం గ్రామాలతోపాటు తిరుమలగిరి సాగర్ మండలానికి చెందిన సుమారు 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకొన్నారు.