నల్లగొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 44,769 క్యూసెక్కుల వరద వచ్చిచేరుతున్నది. జలాశయం నుంచి 3244 క్యూసెక్కుల వదర దిగువకు వెళ్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం 554.40 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. ఇక సాగర్ గరిష్ట నీటినిల్వ సామర్థం 312.40 టీఎంసీలు కాగా, ఇప్పుడు 219.57 టీఎంసీలుగా ఉన్నది.
శ్రీశైలం ప్రాజెక్టుకు మరోసారి భారీగా వరద వస్తున్నది. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి 1,06,750 క్యూసెక్కుల వరద వస్తుండగా 43,492 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగుకుగాను ప్రస్తుతం 879.20 అడుగుల వద్ద ఉన్నది. జలాశయంలో 215.80 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. ఇప్పుడు 183.84 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది. ఇక జూరాల నుంచి 22,162 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 84,588 క్యూసెక్కుల వరద వస్తున్నది.