కరీంనగర్ తెలంగాణచౌక్, ఆగస్టు 4: కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఆటోడ్రైవర్లు కన్నెర్రజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుచేయాలని డిమాండ్ చే స్తూ మంగళవారం కరీంనగర్ ఆటో కార్మి క సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బొ మ్మిడి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో ఆటో కార్మికులు జిల్లాకేంద్రానికి భారీగా తరలివచ్చారు. చాకలి ఐలమ్మ విగ్రహం నుంచి ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ భిక్షాటన చేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం రాకముందు ఒక్కో కార్మికుడికి రోజుకు రూ.వెయ్యి కిరాయి దొరికేదని, ప్రస్తుతం రూ.400 కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆటో కిస్తీలు, ఇంటి కిరాయిలు, పిల్లల ఫీజులు కట్టలేక ఈ రెండున్నరేండ్ల కాలంలో జరిగిన ఆటోడ్రైవర్ల ఆ త్యహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లను ఆదుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసం, అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.