హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన జూరాల, సుంకేశుల నుంచి 24,968 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి స్పిల్వే ద్వారా 26,560 క్యూసెక్కుల నీటిని దిగువవకు విడుదల చేస్తున్నారు. జలాశయంలో ప్రస్తుతం 881.70 అడుగుల వద్ద నీరు ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ఇక శ్రీశైలంలో 215.80 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. ఇప్పుడు 197.45 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. కుడి, ఎడుమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. విద్యుత్పత్తి ద్వారా సాగర్కు 62,638 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. సాగర్కు 59,444 క్యూసెక్కుల వరద వస్తుండగా, 1,000 క్యూసెక్కులు దిగువకు వెళ్తున్నది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.0450 టిఎంసీలు కాగా, ప్రస్తుతం 197.6070 టీఎంసీలుగా ఉంది. సాగర్ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులుగా ఉండగా, ఇప్పుడు 544.40 అడుగువ వద్ద నీరు నిల్వ ఉన్నది.