హైదరాబాద్: ఎగువ నుంచి జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతున్నది. దీంతో ప్రాజెక్టుకు లక్షా 6 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, 16 గేట్ల ద్వారా లక్షా 58 వేల క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 9.65 టీఎంసీలు. ప్రస్తుతం 7.60 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
ఇక ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి భారీగా వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు క్రమం నిండుతున్నది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 2,52,967 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా, 19,070 నీరు దిగువకు వెళ్తున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ఇప్పుడు 876 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 168.2670 టీఎంసీలు కొనసాగుతుంది.