వేములవాడ: ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ రాజన్న (Rajanna) ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీరాజరాజేశ్వరస్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంలోని క్యూలైన్లు నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతున్నది.
సెలవురోజు కావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ధర్మ దర్శనానికి దాదాపు గంటన్నరపైగా సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపుగా అరగంట సమయం పడుతున్నది. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు.