కుమ్రం భీం ఆసిఫాబాద్ : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని(PDS rice) టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 15 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని(Asifabad district) పెంచికల్ పేట మడలంలోని వివిధ గ్రామాల నుంచి రేషన్ బియ్యాన్ని మహారాష్ట్రకు(Maharashtra) తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు ఎల్లూరు గ్రామంలో తనిఖీలు చేపట్టారు.
ఎల్లూరు గ్రామంలోని ఎండీ ముబాషీర్ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 15 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని పెంచికల్పేట పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని టాస్క్ఫోర్స్ సీఐ సీహెచ్ రాణా ప్రతాప్ తెలిపారు. ఈ దాడుల్లో టాస్క్ఫోర్స్ సిబ్బంది పీసీ మధు, రమేష్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.