సిద్దిపేట: దేశ వ్యాప్తంగా ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 44 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేయగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరికి అరుదైన గౌరవం దక్కింది. జిల్లా కేంద్రం సిద్దిపేట ఇందిరానగర్ జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం రామస్వామితో పాటు ఆసిఫాబాద్ జిల్లా సావర్ఖేడ్ హెచ్ఎం రంగయ్యలు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట ఇందిరానగర్ స్కూల్ హెచ్ఎం రామస్వామిని అభినందించారు. రామస్వామి తను ఉపాధ్యాయ వృత్తిని సామాజిక సేవలో భాగంగా భావించి సేవలందించినందుకు ఈ గౌరవం దక్కిందన్నారు.
నిరుపేద విద్యార్థుల పట్ల చూపిన చొరవ రామస్వామి పనితీరుకు, సంకల్పానికి నిదర్శనమని పాఠశాల ఉపాధ్యాయుల సమిష్టి కృషి, ఐక్యతకు ఈ అవార్డు లభించిందన్నారు. ఈ సందర్భంగా రామస్వామికి శుభాకాంక్షలు తెలిపారు.