వరంగల్ : పత్తి రైతు పంట పండింది. ఈ ఏడాది మార్కెట్లో కాసుల వర్షం కురుస్తున్నది. పత్తికి డిమాండ్ ఏర్పడడంతో శుక్రవారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాలు ధర ఏకంగా రూ.11,170 చేరువైంది. ఇప్పటి వరకు ఈ మార్కెట్ లో పత్తికి అత్యధిక ధర ఇదేనని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
దేశంలోనే పంటల ఉత్పత్తిలో మన రాష్ట్రం కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇక్కడ సమ శీతోష్ణ పరిస్థితులు ఉండడంతో అన్ని రకాల పంటలు పండుతాయి. నిన్నటి వరకు మిర్చి పంట ధరల్లో పసిడితో పరుగులు పెడుతుండగా ఇప్పుడు పత్తికి కూడా డిమాండ్ ఏర్పడుతుండటంతో అన్నదాతులు సతోషిస్తున్నారు.