హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ వార్రూం కేసులో సీఆర్పీసీ 41ఏ సెక్షన్ కింద నోటీసు ఇవ్వకుండా సోదాలు చేసి, ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది.
నిరుడు డిసెంబర్ 13న రాత్రి 10.45 గంటల సమయంలో పోలీసులు సోదాలు చేసి, ముగ్గురిని అదుపులోకి తీసుకోవడాన్ని తప్పుపట్టింది. ఇందుకు బాధ్యులైన ఏఎస్సీ ప్రసాద్, సీఐ రమేశ్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జస్టిస్ కే లక్ష్మణ్ ఇటీవల తీర్పు చెప్పారు.