హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): గ్రేస్ మారులపై వివరణ ఇవ్వాలని జేఎన్టీయూహెచ్ను గురువారం హైకోర్టు ఆదేశించింది. కొవిడ్ నేపథ్యంలో ఆన్లైన్ తరగతులు, నెట్వర్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఆర్18 (2018-19), ఆర్ 21 విద్యార్థులకు వర్సిటీ 0.5 శాతం గ్రేస్ మారులు ఇచ్చి, ఆర్ 22 విద్యార్థులకు కేవలం 0.15 శాతం ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి విచారణ చేపట్టారు. కేవలం 0.15 శాతం గ్రేస్ మారులు ఇచ్చారన్నారు. ఆర్ 18, ఆర్ 21 విద్యార్థులతో సమానంగా 0. 5శాతం గ్రేస్ మారులు ఇవ్వాలని కోరారు.