హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ సంబంధిత సమస్యలను నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
రెవెన్యూ శాఖలో రిజిస్టర్ సేల్డీడ్, సర్టిఫైడ్ కాపీలు ఇవ్వడం లేదంటూ దాఖలైన పలు వ్యాజ్యాలపై జస్టిస్ కే లక్ష్మణ్ ఇటీవల విచారణ చేపట్టి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. విచారణను జూన్ 15కి వాయిదా వేశారు.