మంచిర్యాల : జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికలు ( Kyatanapalli municipal elections ) మూడు వారాల్లో నిర్వహించాలని హైకోర్టు ( High Court ) ఆదేశాలు జారీ చేసింది. ఇబ్రహీంపట్నం తరహాలోనే క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని స్పష్టం చేసింది. మున్సిపల్ ఎన్నికలు జరిగి నెలరోజులు కావస్తున్నా క్యాతన్పల్లి మున్సిపల్ ఎన్నికకు కాంగ్రెస్ అడ్డం పడుతుంది.
మెజారిటీ లేకున్నా బలప్రయోగం, బెదిరింపులతో హస్తగతం చేసుకోవాలని నానా ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా క్యాతన్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ , సీపీఐ అభ్యర్థులు 14 మంది గెలుపొందారు. ఇక సమావేశంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక లాంఛనమే అన్న తరుణంలో కాంగ్రెస్కు చెందిన నాయకులు, మంత్రి వివేక్ ,ఎంపీ పోలీసుల సహకారంతో అడ్డుపడుతూ వచ్చారు.
చివరకు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో పాటు బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయించి జైలులు పెట్టారు. అయితే ఇప్పటి వరకు పాలక వర్గం ఎన్నిక నిర్వహించకపోవడంపై బీఆర్ఎస్ శ్రేణులు కోర్టుకు వెళ్లగా హైకోర్టు శుక్రవారం ఎన్నికల నిర్వహణకు తగు ఆదేశాలు జారీ చేసింది.