యాదాద్రి భువనగిరి, జూలై 27(నమస్తే తెలంగాణ) : రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తీరు. హస్తం సర్కారు పాలనలో నిబంధనలు, నియమాలు ఏమీ పాటించడం లేదు. కాంగ్రెస్ భువనగిరి మండల అధ్యక్షుడిగా కొనసాగుతూనే.. మరోవైపు గోపాలమిత్రగా గౌర వం వేతనం పొందుతున్నారు. అంతే కాకుండా అద్దెల ద్వారా పంచాయతీకి రావాల్సిన డబ్బులను ఆయన భార్య, మాజీ సర్పంచ్ బ్యాంకు ఖాతాలో జమ చేసుకుంటున్నారు. ఆయా అంశాలపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ నేత అతికం లక్ష్మీనారాయణ గౌడ్ సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ అనురాగ్ జయంతికి ఫిర్యాదు చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో పాడి రైతుల ఇంటి ముంగిట పశువులకు అత్యవసర వైద్య సేవలు, కృత్రిమ గర్భధారణ అందించడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ గోపాలమిత్ర. పశుసంవర్ధక శాఖ కింద నడుస్తుంది. పశువులకు టీకాలు వేయడం, నట్టల నివారణ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. ప్రభుత్వం నుంచి నెలకు రూ.10,050 గౌరవ వేతనం అందుతుంది. గోపాలమిత్రగా పనిచేస్తున్న వ్యక్తి పార్టీ పదవులు చేపట్టడానికి వీలుండదు. అయితే భువనగిరి మండలంలోని నాగిరెడ్డిపల్లి, నమాత్ పల్లి, నందనం గ్రామాలకు గోపాలమిత్రగా ఎల్లంల జంగయ్య పనిచేస్తున్నారు. నెలనెలా గౌరవం వేతనం కూడా పొందుతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. అయనే ఇప్పుడు కాంగ్రెస్ భువనగిరి మండల అధ్యక్షుడిగా కొనసాగుతుండ టం విశేషం. అంతే కాకుండా ఇందిరమ్మ ఇండ్ల కమిటీలోనూ సభ్యుడిగా ఉన్నారు. ఓ వైపు ప్రభుత్వం నుంచి గౌరవ వేతన పొందుతూనే.. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండటం ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
మండలంలోని నమాత్పల్లిలో పంచాయతీ భవనంలో అంగన్వాడీ కేంద్రం నడుస్తున్నది. దీనికి నెలనెలా అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఆ రెంట్ను పంచాయతీ బ్యాంకు ఖాతాలో జమ చేయా లి. కానీ జంగయ్య భార్య, శాలిని తన ఖాతాలో జమ చేయించుకుంటున్నా రు. ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు సుమారు ఏడేండ్ల కిరాయి వేసుకొని సొంతానికి వాడుకున్నారు. సర్పంచ్ పదవి కాలం ఐదేండ్లతోపాటు, మా జీ సర్పంచ్గా కూడా రెండేండ్లుగా డబ్బు లు ఉపయోగించుకున్నారు. ఇది ప్రభు త్వ సొమ్మును దుర్వినియోగం చేయడమేనని, ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిం చిన మాజీ సర్పంచ్పై నాన్బెయిలబుల్ కేసు పెట్టాలని లక్ష్మీనారాయణ గౌడ్ డిమాండ్ చేశారు. అంతే కాకుండా సాగునీరు పోయే మర్రిచెరువు తూము కాలువను చెడగొట్టి ఇంటి నిర్మాణం చేపట్టారని ఫిర్యాదులో కోరారు.