BRS MLCs | మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిని ఏకపక్షంగా సస్పెండ్ చేశారు. శాసనమండలి నుండి ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి, తాతా మధులను సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. సభలో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఛాంబర్ ఎదుట బైఠాయించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రభుత్వ నిరంకుశ వైఖరి, అప్రజాస్వామిక వైఖరి, చట్ట వ్యతిరేక వైఖరి, సభా వ్యతిరేక వైఖరి నశించాలి.. మహిళా ద్రోహి ప్రభుత్వం, దుర్యోధన, దుశ్శాసన, దృతరాష్ట్ర ప్రభుత్వం నశించాలి.. పిరికి ప్రభుత్వం నశించాలి.. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్.. రేవంత్ రెడ్డి పిరికిపంద.. రూల్స్కు విరుద్దంగా చేసిన సస్పెన్షన్ను ఎత్తివేయాలి అంటూ నినాదాలు చేశారు.
మరోవైపు ఎమ్మెల్సీ మీడియా పాయింట్లో మాట్లాడుతుండగా తాతా మధుపై అసెంబ్లీ మార్షల్స్ దౌర్జన్యం చేశారు. మార్షల్స్ బలవంతంగా ఎమ్మెల్సీలు మధు, నవీన్ కుమార్ రెడ్డిని మీడియా పాయింట్ నుంచి లాక్కెళ్లారు.
శాసనమండలి నుండి నవీన్ రెడ్డి, తాతా మధులను సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన
సభలో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నందుకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఛాంబర్ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్సీల బైఠాయింపు pic.twitter.com/Wn9yRcXF0b
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2026
National Film Awards | ఢిల్లీకి వీడ్కోలు.. జాతీయ చలనచిత్ర అవార్డుల వేదికలో కీలక మార్పు!
Punjab Farmer: పంజాబ్లో డ్రగ్స్.. రైతు ఆత్మహత్యతో తీవ్ర దుమారం