చండీఘడ్: పంజాబ్కు చెందిన 50 ఏళ్ల రైతు గుల్జార్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. విషపూరిత సల్ఫస్ను తీసుకుని అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో పంజాబ్లో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగుతున్నది. సంగ్రూర్ ఆస్పత్రిలో రైతు గుల్జార్ మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా ఎక్కువైనట్లు ఇటీవల గుల్జార్ ఆరోపించారు. ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ ఈవెంట్లో గుల్జార్ తన నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్ అమ్మకాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. తన కుమారుడు డ్రగ్స్కు బానిసైనట్లు రైతు గుల్జార్ పేర్కొన్న ఓ వీడియో వైరల్ అయ్యింది. దీంతో అతనిపై పోలీసుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఆ వేధింపులు తట్టుకోలేక రైతు గుల్జార్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల వేధింపుల వల్లే గుల్జార్ విషపూరిత పదార్ధాన్ని సేవించినట్లు తెలిసింది. లాథియానా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మృతిచెందాడు. అయితే ఈ కేసులో ఆ గ్రామ సర్పంచ్తో పాటు ఇద్దరు వ్యక్తులపై కేసు బుక్ చేశారు. వారి వేధింపుల వల్లే గుల్జార్ మృతిచెందినట్లు అధికారులు పేర్కొన్నారు.