Akbaruddin Owaisi : శాసనసభలో బీఆర్ఎస్ పార్టీకి ఒక న్యాయం, బీజేపీకి ఒక న్యాయమా..? అని ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్లని టీషర్టులు, వాటిపై ఏదో రాసి ఉందనే కారణంతో వారిని సభలోకి అనుమతించలేదని, మరి బీజేపీ సభ్యులు ప్లకార్డులను ప్రదర్శించడాన్ని ఎందుకు అనుమతించారని ఆయన నిలదీశారు. టీషర్టుల ధరిస్తే సభలోకి అనుమతి లేనప్పుడు, సభలో ఫొటలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించేందుకు కూడా ఇవ్వకూడదు కదా అని క్వశ్చన్ చేశారు.
మీరు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని ఒకలా, బీజేపీని ఒకలా ట్రీట్ చేస్తున్నారని, ఇది కరెక్టు కాదని అక్బరుద్దీన్ చెప్పారు. బీజేపీకి స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకని ప్రశ్నించారు. రూల్స్ అందరికీ ఒకేలా ఉండవా..? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వ తీరును ఈ విధంగా ఎండగట్టారు. సభాపతి స్థానంలో కడియం శ్రీహరి కూర్చుని ఉన్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ నాయకులు టీ షర్టులు వేసుకొని దాని మీద ఏదో రాసుకున్నారని అసెంబ్లీకి రానివ్వలేదు
మరి బీజేపీ ఎమ్మెల్యేలకు ప్లకార్డులు ప్రదర్శించే అనుమతి ఎలా ఇచ్చారు?
ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్కు ఒక రకమైన ట్రీట్మెంట్, బీజేపీకి స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు ఇస్తున్నారు?
నిబంధనలు అందరికి… https://t.co/wMUuS37orA pic.twitter.com/risXa6N45F
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2026