హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల నుంచి నెలవారీగా తీసుకున్న నిధులను వారి సహకార పరపతి సంఘానికి (సీసీఎస్కు) జమ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆర్టీసీ సొంత అవసరాలకు ఆ నిధులను వాడకూడదని తేల్చిచెప్పింది. విచారణను 18కి వాయిదా వేసింది.