రాజన్న సిరిసిల్ల : మహాశివరాత్రి(Mahashivratri) పర్వదినాన్ని పురస్కరించుకొని హైకోర్టు జడ్జి(High Court Judge) కె. సురేందర్ కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ రాజరాజేశ్వర స్వామి(Rajanna Temple) వారిని దర్శించుకున్నారు. న్యాయమూర్తి ఆలయానికి చేరుకోగానే ఈఓ కృష్ణ ప్రసాద్, ఏఈఓ హరికిషన్, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
హైకోర్టు జడ్జితోపాటు రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్జి ప్రేమలత, సబ్ జడ్జి రవీందర్, జూనియర్ సివిల్ జడ్జిలు ప్రవీణ్, జ్యోతిర్మయి, సుజన వారి కుటుంబ సభ్యులతో స్వామి వారిని దర్శించుకోగా, వారిని ఆశీర్వదించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అలాగే స్వామివారిని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ తదితరులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్, డీఎస్పీ నాగేంద్రచారి, ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.