హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): వినాయకచవితి ఉత్సవాలు, నిమజ్జనంపై రాష్ట్ర హైకోర్టు ఆంక్షలు విధించింది. పర్యావరణ పరిరక్షణ, జల, వాయు కాలుష్యాలను అరికట్టేందుకు మార్గదర్శకాలను జారీచేసింది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూడాలని అధికారులను తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు, న్యాయమూర్తి జస్టిస్ టీ వినోద్కుమార్తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ధర్మాసనం గురువారం తీర్పు చెప్పింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ)తో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్సాగర్తోపాటు ఇతర నీటివనరుల్లోనూ, చెరువుల్లోనూ నిమజ్జనం చేయకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. ఇతర విగ్రహాలను హుస్సేన్సాగర్ మొత్తం నీటిలో నిమజ్జనం కాకుండా ప్రత్యేకంగా రబ్బర్ డ్యాం తరహా ఏర్పాట్లుచేసి అకడే నిమజ్జనానికి అనుమతించాలని సూచించింది. పీవోపీ విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన నీటి కుంటల్లోనే నిమజ్జనం జరిగేలా చూడాలని పేర్కొన్నది. పీవోపీ విగ్రహాలను ఏయే కుంటలకు తరలించాలో పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు నిర్వహకులకు ముందుగానే చెప్పాలని తెలిపింది. విగ్రహాలు ట్యాంక్బండ్ దిశగా వెళ్లకుండా సచివాలయం, ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గం, నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్ వైపు నుంచి అనుమతించాలని ఆదేశించింది. నిమజ్జనం తర్వాత వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని పేర్కొన్నది.
2020 మే లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సూచనల మేరకు పీవోపీ, సింథటిక్ పెయింట్స్ వినియోగించిన విగ్రహాలను వినియోగించకుండా వచ్చే ఏడాది వినాయక చవితి నుంచి ప్రభుత్వం అమలు చేయాలని హైకోర్టు సూచించింది. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను వచ్చే ఏడాది మార్చి 31 నాటికి జారీ చేయాలని పేర్కొన్నది. ట్యాంక్బండ్ సుందరీకరణ కోసం ప్రభుత్వం ఏటా చేస్తున్న ఖర్చు.. వినాయక నిమజ్జనం వల్ల వృథా అవుతున్నదని అభిప్రాయపడింది. ‘విఘ్నాలు తొలిగిపోవడానికి వినాయకుడికి పూజలు చేయడం ఆనవాయితీ. 11 రోజులపాటు పూజలు చేసి చివరి రోజు నిమజ్జనం చేస్తారు. ఇందుకు ప్రభుత్వం హుస్సేన్సాగర్లో చేసేందుకు అనుమతి ఇచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల హుస్సేన్సాగర్ నీరు కలుషితం అవుతున్నది. దీనిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. జీహెచ్ఎంసీ 50 వేలు, హెచ్ఎండీఏ 75 వేలు ఏటా మట్టి విగ్రహాల్ని ఉచితంగా ఇస్తున్నాయి. పీవోపీ, సింథటిక్, కెమికల్స్తో చేసిన విగ్రహాలను వినియోగించకుండా చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది’ అని హైకోర్టు పేర్కొన్నది.
భారీ వర్షాలతో పంట లు నీట మునిగి నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని చెన్నూర్, కోటపల్లి మండలాల్లో గోదావరి వరదతో నీట మునిగిన పొలాలను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. చెన్నూర్, కోటపల్లి, జైపూర్ మండలాల్లో 2,600 మంది రైతులకు సంబంధించి 5,600 పైచిలుకు ఎకరాల్లో పత్తి, వరి తదితర పంటలు నష్టపోయినట్టు ప్రాథమిక నివేదకను ప్రభుత్వానికి పంపించినట్టు చెప్పారు. బుధవారం నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులతో కలిసి ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావును కలిసినట్టు చెప్పారు. గోదావరి, ప్రాణహిత నదుల ముంపు నుంచి శాశ్వత పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. రెండు, మూడు రోజుల్లో పంట నష్టంపై పూర్తి స్థాయి నివేదికలు సిద్ధం కాగానే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.