హైదరాబాద్, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ): సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల నిర్వహణపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. ఈ నెల 27న గుర్తింపు సంఘం ఎన్నికలను యధాతథంగా నిర్వహించాలని గురువారం హైకోర్టు తీర్పునిచ్చింది.
సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి వేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆర్ఎల్సీని, యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జూకంటి అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.