హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఎన్నికను సవాల్ చేస్తూ నాగం జనార్దన్రెడ్డి వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. 2018 అసెం బ్లీ ఎన్నికల్లో నాగర్కర్నూల్ నుంచి బీఆర్ఎస్ తరఫున మర్రి, కాంగ్రెస్ నుంచి నాగం పోటీచేశారు.
మర్రి దాఖలు చేసిన అఫిడవిట్లో అనేక విషయాలు దాచిపెట్టారని, నిబంధనలను ఉల్లంఘించారని, ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోరుతూ నాగం పిటిషన్ దాఖలు చేశారు. ఆధారాలను చూపకపోవడంతో హైకోర్టు ఆ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు చెప్పింది.