హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తె లంగాణ): హైదరాబాద్ దుర్గం చెరువు లో ఆక్రమణలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చెరువులోకి రసాయన వ్యర్థాలు చేరకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని, చెరువు పరిరక్షణ కోసం నిపుణుల కమిటీ సమర్పించిన సత్వర ప్రణాళికను అమలుచేయాలని ఆదేశించింది.
ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్కుమార్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దుర్గం చెరువులో కాలుష్యంతో చేపలు మరణించి నీటిపై తేలుతున్నాయంటూ పత్రికల్లో వచ్చిన వార్తలను హైకోర్టు సుమోటోగా తీసుకొన్నది.