వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భుదవారం భారీగా ట్రాఫిక్ జాం అయింది. వేములవాడ మూల వాగు వంతెనపై దాదాపు కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
భారీగా శుభకార్యాలు ఉండటంతో రాజన్న సన్నిధికి భక్తుల తాకిడి పెరిగింది. ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.