హైదరాబాద్, మార్చి 7 : రాష్ట్రప్రభుత్వం చేపట్టిన మౌలిక వసతుల కల్పన, ఇంగ్లిష్ మీడియం విద్య, సాఫ్ట్ స్కిల్స్ తదితర చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ వేగంగా పెరుగుతున్నది. 2020-21లో 44.9 శాతం ఎన్రోల్మెంట్ ఉండగా, 2021-22లో 46.29 శాతానికి చేరింది. 2,35,439 మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లను వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని ఆర్థిక సర్వే-2022 వెల్లడించింది.