హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా విచిత్ర వాతావరణం నెలకొన్నది. కొన్ని జిల్లాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొడుతుంటే.. మరికొన్ని జిల్లాల్లో మాత్రం వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. శనివారం అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో 42.8డిగ్రీలTemperature నమోదు కాగా, మరో 22 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది.
జగిత్యాల జిల్లా వెల్గటూర్ అత్యధికంగా 7.9 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, జీహెచ్ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్లో 6సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది. ఆదివారం మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.