Red Alert | వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలకు వాగులువంకలు పొంగుతున్నాయి. ఎక్కడ చూసినా కనుచూపుమేరంతా వర్షంనీరే కనిపిస్తున్నది. ఈ క్రమంలోనే వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది. వర్షాలు మరో ఐదురోజుల పాటు కొనసాగుతాయని హెచ్చరించింది. ఆదివారం ఆదిలాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంటూ రెడ్ అలెర్ట్ను జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతాయని చెప్పింది.
దాంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. మేడ్చల్ మల్కాజ్గిరి, జోగులాంబ గద్వాలతో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. సోమవారం నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్క భారీ వర్షాలు నమోదవుతాయని అంచనా వేసింది. ఇక గడిచిన 24 గంటల్లో అతిభారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా కాకర్వాయ్లో అత్యధికంగా 52 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. మహబూబాబాద్ ఇనగుర్తిలో 45.6, వరంగల్ జిల్లా రెడ్లవాడలో 45.4, మహబూబాబాద్ చిన్నగూడూర్లో 45.2 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైందని టీజీడీపీఎస్ వివరించింది.
Heavy rains | జల దిగ్బంధంలో అర్వపల్లి కేజీబీవీ.. ఫంక్షన్ హాల్లో తలదాచుకున్న విద్యార్థులు
Sarlasagar | తెరుచుకున్న సరళాసాగర్ సైఫన్ గేట్స్