వరంగల్ అర్బన్ : కమలాపూర్ మండలం ఉప్పలపల్లి, నెరేళ్ల,శనిగరం గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన పలువురు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మండల ఇంచార్జి పేరియాల రవీందర్ సమక్షంలో వంద మందికి పైగా టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
పార్టీలో చేరిన వారిలో ఉప్పలపల్లి గ్రామ వార్డు మెంబర్లు బూర్గుల శ్రీలత తిరుపతి, చేపురి సారమ్మ , బాషబోయిన సుగుణ శ్రీనివాస్, ఆకుల పుష్పలీల చంద్రమౌళి, శనిగరం గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి వక్కల సదానందం, వార్డు సభ్యులు మేకల అనిల్, నెరేళ్ల గ్రామానికి చెందిన అంగిరికే మల్లయ్య, రాజయ్య, రవీందర్, బాసిరి కిరణ్, ఉపాసి నాగరాజు, బేతి రవీందర్, వాడికారి దామోదర్, మురళి, బేతి తిరుపతి, బాసిరి రాజేశ్వర్ రావు, ఉడుత అయిలు కొమురు, వేల్పుల అనిల్, సల్పాల ఓదెలు, లకిడే కిష్టయ్యలతో పాటు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
టీకాల కొరత : కేంద్రంపై శివసేన ఎంపీ ఫైర్
ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
నిరు పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
నారింజ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద